Komuravelli Mallanna : కొమురవెల్లి మల్లన్న కల్యాణం వైభవంగా జరిగింది. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదికపై…. మల్లికార్జునుడు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు. రూ.కోటి విలువైన బంగారు కిరీటాన్ని కూడా సమర్పించారు. ఈ కల్యాణ వేడుకకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
కల్యాణోత్సవంలో భాగంగా ఉదయం 5 గంటలకు స్వామి వారికి దృష్టికుంభం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు. రాత్రి ఏడు గంటలకు రథోత్సవం జరగనుంది. సోమవారం ఉదయం 9 గంటలకు స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, అనంతరం మహా మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.