Komatireddy venkat reddy : యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్గఢ్లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న భయంతోనే తనపై మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలపారు. విద్యుత్ కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్, సిటింగ్ జడ్జి విచారణ జరుగుతుందని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లేది జగదీశ్ రెడ్డేనని పేర్కొన్నారు.
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్గఢ్లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న భయంతోనే తనపై మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. విద్యుత్ కేంద్రాల్లో అవకతవకలపై విజిలెన్స్, సిటింగ్ జడ్జి విచారణ జరుగుతుందని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు వెళ్లేది జగదీశ్ రెడ్డేనని పేర్కొన్నారు.
రాష్ట్రంలో తమ ప్రభుత్వం కూలిపోదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పూర్తికాలం అధికారంలో ఉంటుందని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు మిగలరని హెద్దేశా చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారని ప్రకటించారు. నల్గొండ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంతో పాటు తిప్పర్తి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిలేశానని గుర్తు చేశారు. అలాంటిది మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తన కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందని తెలిపారు. ఆయనకు రూ.వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఇచ్చిన హామీలను అమలు పరుస్తామని తెలిపారు. వందరోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి కేటీఆర్ కరెంట్ బిల్లులు కట్టవద్దు అనే మాటలు మానుకోవాలని వెంకట్ రెడ్డి సూచించారు.