Komatireddy Venkat Reddy : నల్గొండ నియోజకవర్గంలో వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కానీ 2018 ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగారు. ఐదోసారి గెలవడం ఖాయమని అంటున్నారాయన.
నల్గొండ నియోజకవర్గ ప్రజలతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని కోమటిరెడ్డి తెలిపారు. ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేసీఆర్కు లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేస్తూ బిజీగా ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే రోడ్లు వేశామని వివరించారు. నీళ్లు తెచ్చింది తామేనని స్పష్టం చేశారు. కానీ ఆ తర్వాత అభివృద్ధి జరగలేదన్నారు.
నల్గొండను దత్తతను తీసుకుంటానని కేసీఆర్ మోసం చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.కేసీఆర్ పాలనలో ఇళ్లు నిర్మించలేదు. ఉద్యోగాలు రాలేదన్నారు. 24 గంటల కరెంట్ కూడా రావడం లేదని మండిపడ్డారు.కేసీఆర్ ఏ మొహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతారని నిలదీశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెంటీలు అమలు చేస్తోందని చెప్పారు. తెలంగాణలోనూ బరాబర్ అమలు చేస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.