Komatireddy Venkat Reddy : ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. మంత్రి కోమటిరెడ్డితో పాటు సభ్యులు శ్రీధర్ బాబు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీలు పాల్గొన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కమిటీ చర్చించింది.
Komatireddy Venkat Reddy : ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. మంగళవారం గాంధీభవన్లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. మంత్రి కోమటిరెడ్డితో పాటు సభ్యులు శ్రీధర్ బాబు, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీలు పాల్గొన్నారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కమిటీ చర్చించింది.
అనంతరం కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చుతామన్నారు. వంద రోజుల్లో హామీలన్ని అమలు చేసి తీరుతామన్నారు. కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల రాష్ట్రం అప్పులపాలైందని విమర్శించారు. అందువల్లే హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు.
నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని కోమిటి రెడ్డి వెంకట్ రెడ్డి జోష్యం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.