Komatireddy Rajagopal Reddy : మంత్రి కేటీఆర్ పై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు దత్తత తీసుకుంటానని చండూరులో మంత్రి కేటీఆర్ చెప్పారని, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవన్నారు.
నల్గొండ జిల్లా చండూర్ మున్సిపల్ కేంద్రంలో రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు అధికార పార్టీకి ఓటేసి గెలిపించారన్నారు.
కానీ నెలన్నర కావస్తున్నా ఇప్పటివరకు నియోజకవర్గంలో ఒక్క పని కూడా ప్రారంభం కాలేదన్నారు. కేవలం రివ్యూ మీటింగ్ చేసి మునుగోడు నియోజకవర్గంతో పాటు జిల్లాకు నిధులు ఇస్తామన్నారని, ఇప్పటి వరకు నిధులు రాలేదన్నారు.