Kishan Reddy : లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు సీట్లు గెలిచినా.. ఓడినా వచ్చే నష్టమేమీ లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం వాటిని ఎలా అమలు చేయాలనే రూట్మ్యాప్ వారి వద్ద లేదని విమర్శించారు.
ప్రధాని మోదీ హయాంలో దేశంలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకా 1500కు పైగా పనికిరాని చట్టాలను రద్దు చేశామని ప్రకటించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ర్టంలో అర్హులైన ప్రజలకి ఇళ్లు నిర్మించి ఇవ్వలేకపోయారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.