Kishan Reddy : కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టే అని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాలన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ ను అపర భగీరథునిగా కీర్తించిందన్నారు. అన్ని ప్రాజెక్టులకూ కేసీఆరే చీఫ్ ఇంజనీర్ అన్నట్లు ప్రచారం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ. లక్ష కోట్ల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
Kishan Reddy : కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కాం కాళేశ్వరం ప్రాజెక్టే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై దర్యాప్తు చేయాలన్నారు. గత ప్రభుత్వం కేసీఆర్ ను అపర భగీరథునిగా కీర్తించిందన్నారు. అన్ని ప్రాజెక్టులకూ కేసీఆరే చీఫ్ ఇంజనీర్ అన్నట్లు ప్రచారం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ. లక్ష కోట్ల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతుందో ప్రకటించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు కోరితే 48 గంటల్లోనే విచారణ జరిగేలా సిఫార్సు చేస్తానని తెలిపారు. సీబీఐ దర్యాప్తు కోరకుంటే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో చర్చిస్తామన్నారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సంధి కుదిరిందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటి కాదని నిరూపించుకోవాలని కిషన్రెడ్డి అన్నారు.