హైదరాబాద్, స్వేచ్ఛ: సికింద్రాబాద్లోని మోండా డివిజన్, కుమ్మరవాడలో పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న ప్రాచీన ముత్యాలమ్మ ఆలయంలోని విగ్రహాలను కొందరు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి, ఇది మతోన్మాదుల చర్యగా పేర్కొన్నారు. భాగ్యనగరంలో నవరాత్రుల సందర్భంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహాలను, వివిధ ఆలయాలను కొందరు మతోన్మాద శక్తులు విధ్వంసం చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా విమర్శించారు. గణేష్ నవరాత్రులలో డీజేలు, పూజలు ఆపే ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ ఘటనపై లోతైన విచారణ జరిపి, విగ్రహాలను ధ్వంసం చేసిన వారికి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. హిందూ ఆలయాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి.
Also Read: కులగణనకు లైన్ క్లియర్.. జనవరిలో స్థానిక ఎన్నికలకు పచ్చజెండా