Kishan Reddy : భారత్ మాల, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) భూసేకరణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy).. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రోడ్లకు భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.
భారత్ మాల, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) భూసేకరణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy).. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) లేఖ రాశారు. రాష్ట్రంలో భారత్ మాల ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రోడ్లకు భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.
ఆర్ఆర్ఆర్ భూసేకరణ కోసం నాయ్కు 50 శాతం నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కిషన్ రెడ్డి కోరారు. గతంలో ఇవే అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డుకు నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లు, నీటి కాలువల మళ్లింపు, స్తంభాల తరలింపు చేయాలని గతంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకి రాష్ట ప్రభుత్వం లేఖ రాసింది. అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేయాలని లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.