EPAPER

Khammam: పామాయిల్ రైతుల ఆందోళన.. పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్..

Khammam: పామాయిల్ రైతుల ఆందోళన.. పూర్తి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్..

Khammam: ఖమ్మం జిల్లా వైరాలోని అంజనాపురంలో గత ప్రభుత్వ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కేటీఆర్ పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఆగమేఘాల శంకు స్థాపన చేశారు. గోద్రెజ్ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించేందుకు ఒప్పందం జరిగింది. అయితే ఫ్యాక్టరీ నిర్మాణానికి కావలసిన భూమిని గిరిజన, సన్న, చిన్నకారు రైతుల వద్ద నుంచి బలవంతంగా గుంజుకున్నారని రైతులు ఆందోళన చేశారు. జిల్లా అధికారులే బెదిరించి వంద ఎకరాలకు పైగా భూమిని తమ వద్ద నుంచి సేకరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంగా ఒక్క ఎకరానికి రూ.25 లక్షలు వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. భూమిని ఇచ్చిన తర్వాత కేవలం రూ.20 లక్షలు మాత్రమే చెల్లించారని.. మిగిలిన రూ.5 లక్షలు చెల్లించడం లేదని రైతులు వాపోయారు. ఇదే విషయంపై కలెక్టర్ కార్యాలయంలో ఉన్న అధికారులను సంప్రదిస్తే సరైన సమాధానం ఇవ్వడం లేదని.. ఇక చేసేది ఏమీ లేక అందోళన బాట పట్టామని రైతులు తెలిపారు.


Tags

Related News

Cabinet Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. హైడ్రాకు విస్తృత అధికారాలు

Indira Shoban: ఇంకా కూడా కేటీఆర్‌‌కు సిగ్గు రాలేదు: ఇందిరా శోభన్

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా, తొలిసారి వారికి కూడా..: సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Big Stories

×