ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం లాలాపురం గ్రామం సమీపంలో వృద్ధురాలి మెడలో చైన్ ను గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి లాక్కెళ్లారు. లాలాపురం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన కొత్త సావిత్రమ్మ అనే వృద్ధురాలు నడిచి వెళ్తుండగా బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు.. రోడ్డు పక్కన సుబాబుల్ తోట ఎవరిదని అడుగుతూ మాటల్లో పెట్టి.. చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. అనంతరం వృద్ధురాలిని రోడ్డు పక్కకు నెట్టివేశారు.
ఆమె కింద పడిపోవడంతో వెంటనే మెడలో ఉన్న మూడు తులాల గొలుసును లాక్కొని బైక్ పై పరారయ్యారు. సావిత్రమ్మ వెంటనే కేకలు వేయడంతో స్థానికులు దగ్గరకు వచ్చి విషయం తెలుసుకుని కొణిజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొలుసు విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. ఘటనా స్థలాన్ని వైరా ఏసీపీ రహమాన్, సిఐ సాగర్, ఎస్ఐ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.