కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను తెలంగాణ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విషయంలో పూర్తి వివరాలు సేకరించాలని.. ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా టీపీసీసీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి కాళేశ్వరంలో అవకతవకలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నిరంజన్ రెడ్డి ఫిర్యాదుతో భూపాలపల్లి జిల్లా మహదేవపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇప్పుడు కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ క్రమంలోనే విచారణను హైకోర్టు రెండు వారాలు వాయిదా వేసింది.