EPAPER
Kirrak Couples Episode 1

KCR : వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కేసీఆర్, కవిత బోనం సమర్పణ..

KCR : వైభవంగా ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు.. అమ్మవారికి కేసీఆర్, కవిత బోనం సమర్పణ..

KCR: లష్కర్ బోనాలు వైభవంగా సాగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్నారు. వారికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్‌ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్ర కరణ్‌రెడ్డి ఉన్నారు.


ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మహంకాళి బోనాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఏటా ఈ వేడుకలను వైభవంగా నిర్వహిస్తోంది.

ఆషాఢమాసంలో దేవతలను పూజించే ఈ బోనాలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. డబ్బుచప్పుళ్లతో నెత్తిన బోనమెత్తి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. భక్తులు భారీగా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసింది.


Related News

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

RTC Electric Buses: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న 35 ఎలక్ట్రిక్ బస్సులు

Horoscope 29 September 2024: ఈ రాశి వారికి ఆటంకాలు.. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది!

Drivers cheated: వెలుగులోకి కొత్త రకం దొంగతనం.. ప్రమాదమని చెప్పి..!

Special Trains: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు!

Siddaramaiah: సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ఎఫ్ఐఆర్ దాఖలు..గట్టిగానే చుట్టుకున్న ‘ముడా’!

Big Stories

×