బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్లో సమావేశమై తీర్మానం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాలో నిలిచింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు శస్త్రచికిత్స జరిగింది. నేడు జరగిన సమావేశానికి కేసీఆర్ హాజరు కాలేదు.
మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొననారు. కేసీఆర్ను తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఆమోదించారు. అనారోగ్య కారణంగా కేసీఆర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయట్లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.