Kamareddy : తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి పాలయ్యారు. కేసీఆర్ పై బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అయితే ఆయన గజ్వేల్ తోపాటు కామారెడ్డిలోనూ పోటీ చేయడంతో రాజకీయం హీటెక్కింది. అక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే పోలింగ్ తర్వాత బీజేపీ అభ్యర్థి గెలుస్తారనే ప్రచారం జరిగింది. ఆరా సర్వే అదే విషయాన్ని చెప్పింది. కామారెడ్డిలో కేసీఆర్ ఓటమి ఖాయమని తేలిపోయింది. అంచనాల ప్రకారమే తెలంగాణ సీఎం ఓటమి పాలయ్యారు.కేసీఆర్ పై బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి 5,156 ఓట్ల తేడాతో విజయం సాధించారు.