గెలుస్తామనే ధీమాతో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్.. 22 ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ కొన్నారు. ఇంతలో ప్రజల్లో వ్యతిరేకతను గుర్తించారు. రాష్ట్రానికి తీసుకొస్తే ప్రజలు భగ్గుమంటారని గ్రహించి పొరుగు రాష్ట్రంలో ఆ వెహికల్స్ని దాచిపెట్టారు. విజయవాడలోని మిల్లర్ త్రివేణి సంస్ధలో దాచిపెట్టినట్టు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఫాంహౌస్కి వెళ్లిపోయినా 22 ల్యాండ్ క్రూజర్లు కొన్న విషయం మాత్రం బయటకురాలేదు. కానీ ఓ అధికారి సీఎం రేవంత్రెడ్డికి చెప్పడంతో ఆ వెహికల్స్ విషయంలో బీఆర్ఎస్ నాయకుల బండారం బయటపడింది.
ఒక్కో వాహనానికి మూడు కోట్లు ఖర్చు చేశారని తెలుస్తోంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలుగా మార్చితెే ఇంకా ఖర్చు పెరిగేదని సదరు అధికారి తెలిపారు. 22 ల్యాండ్ క్రూజర్ వెహికల్స్ ప్రజా ధనంతో కొన్న వాహనాలేనని ఆయన స్పష్టం చేశారు.