హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం మెరుగైంది. ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో శుక్రకారం డిశ్చార్జ్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా నందినగర్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు.
కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు. శుక్రం డిశ్చార్జ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోని బాత్రూమ్లో ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో కేసీఆర్ గాయపడ్డారు. ఆయన తుంటి ఎముక విరిగింది. యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లను అమర్చారు. ఆపరేషన్ తర్వాత సపోర్ట్ ఆయనను వైద్యులు నడిపించారు. శస్త్ర చికిత్స సక్సెస్ అయ్యి కేసీఆర్ కోలుకోవడంతో ఇప్పుడు డిశార్జ్ చేయాలని నిర్ణయించారు.