Dharani Scam : ధరణి పేరుతో గత ప్రభుత్వం గిరిజనులను దగా చేసిందని ధరణి కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆరున్నర లక్షల అటవీ భూములను వారికి అందకుండా చేశారని కమిటీ వెల్లడించింది. వ్యవసాయ, గిరిజన సంక్షేమం, అటవీ శాఖలకు చెందిన ముఖ్య అధికారులతో పాటు పలువురు క్షేత్రస్థాయి సిబ్బందితో ధరణి కమిటీ భేటీ అయ్యింది. రైతుకు చెందాల్సిన పెట్టుబడి సహాయం రియల్ ఎస్టేట్ చేతిలోకి వెళ్లిందన తేల్చారు.
20 లక్షల ఎకరాల నాన్ కల్టివేషన్ ల్యాండ్ కు.. కేసిఆర్ ప్రభుత్వం రైతుబంధు అమలు చేసినట్లు కమిటీ తేల్చింది. సుమారు 20 వేలకోట్లు వ్యవసాయనికి పనికిరాని భూములకు కూడా రైతుబంధు ఇవ్వటం గమనార్హం. తెలంగాణలో 72 లక్షల మంది రైతులు.. కోటి 59 లక్షల ఎకరాలకు కేటాయించగా.. 5 ఎకరాలు లోపు రైతులు 92 శాతం.. 5 ఎకరాల పైన భూమి ఉన్న రైతులు 8 శాతంగా తేలింది. ధరణి పాపాల పుట్ట ఒక్కొక్కటి బయటపడుతున్నాయని కమిటీ వెల్లడించింది.