యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 7వ తేదీ రాత్రి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లోని బాత్రూమ్లో కాలు జారి పడటంతో.. కేసీఆర్ను కుటుంబ సభ్యులు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్చారు.
కేసీఆర్ ను పరీక్షించిన వైద్యులు తుంటి ఎముక విరిగిపోయిందని తెలిపారు. వెంటనే డాక్టర్లు ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసి.. మరో ఎముకను అమర్చారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటుండటంతో.. ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని వైద్యులు సూచించారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఆస్పత్రి నుంచి నందినగర్లోని ఇంటికి తీసుకెళ్లారు. ఇంకా 6 వారాలు రెస్ట్ అవసరమని వైద్యులు తెలిపారు. అలాగే ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలని సూచించారు.
.
.