Revanth Reddy Kamareddy | కామారెడ్డిలో వేలాది ఎకరాల్లో ఉన్న పచ్చని భూములను ఆక్రమించుకోవాడానికే కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు.
కామారెడ్డిలో వేలాది ఎకరాల్లో ఉన్న పచ్చని భూములను ఆక్రమించుకోవాడానికే కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్ విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు.
సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “మనిషి రక్తం రుచి మరిగిన పులి కేసీఆర్.. ఆ పులిని వేటాడడానికి వచ్చిన వేటగాడిగా నన్ను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇక్కడికి పంపించారు. తెలంగాణ ద్రోహి అయిన కేసీఆర్ను ఓడించడానికే కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నాను. 40 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా గెలిపించారు.. అలాగే పదేళ్ల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎప్పుడైనా కామారెడ్డికి వచ్చారా.. ఆయన ఇక్కడి ప్రజల సమస్యలను పట్టించుకున్నాడా? లేదు. కామారెడ్డి గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. వారి సమస్యలు గురించి ఏనాడైనా విన్నాడా? అలాగే బీడి కార్మికులకు పేదరికంలో ఉన్నారు. వారికి పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు. ఈ సమస్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుస్తుంది. అందుకే కామారెడ్డి తీర్పు తెలంగాణ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అందుకే కామారెడ్డి ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయాలని ప్రార్థిస్తున్నాను,” అని చెప్పారు.