ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ మళ్లీ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఆ నోటీసులను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నారు. తనకు మోదీ నోటీసు వచ్చిందని సెటైర్ వేశారు. రాజకీయ కక్షసాధింపుతోనే ఈ నోటీసు వచ్చిందని ఆరోపించారు. ఆ నోటీసును పార్టీ లీగల్ టీమ్కు పంపామన్నారు. లీగల్ టీమ్ సలహా ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు.
ఢిల్లీ మద్యం కేసు విచారణ ఏడాది నుంచి కొనసాగుతూనే ఉందన్నారు కవిత. టీవీ సీరియల్లా సాగదీస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే మరో ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారని విమర్శించారు. నోటీసును సీరియస్గా తీసుకోవద్దన్నారు. ఈ విచారణ ఎంతకాలం కొనసాగుతుందో తెలియదన్నారు. గతంలో 2జీ కేసు విచారణ చాలా కాలం సాగిన విషయాన్ని గుర్తు చేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు రావాలని కోరింది. ఈ కేసులో దినేశ్ అరోరా, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, శరత్చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవ నిందితులుగా ఉన్నారు. వారు ఇప్పటికే అప్రూవర్లుగా మారారు. ఈ కేసులో మార్చి 16, 20, 21 తేదీల్లో ఢిల్లీలో కవిత విచారించింది ఈడీ. ఇప్పుడు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. మరి ఆమె విచారణకు హాజరవుతారా?