Kavitha: బిగ్ బ్రేకింగ్ న్యూస్. అనుకున్నట్టుగానే అయింది. బీజేపీ ఆరోపిస్తున్నట్టుగానే జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చింది ఈడీ. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావించింది.
సౌత్ గ్రూపును శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డిలు కంట్రోల్ చేశారని పేర్కొంది. సౌత్ లాబీ పేరుతో 100 కోట్లను విజయ్ నాయర్ కు ముట్టజెప్పినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. ఆధారాలు మాయం చేసేందుకు కవిత 10 సెల్ ఫోన్లు ధ్వంసం చేసినట్టు రిపోర్టులో ప్రస్తావించింది. మనీష్ సిసోడియాతో పాటు మొత్తం 36 మందికి చెందిన 170 సెల్ ఫోన్లు ధ్వంసం చేసినట్టు ఈడీ గుర్తించింది.
కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా చేర్చడం ఏపీలో కలకలం రేపుతోంది. సౌత్ గ్రూప్.. 100 కోట్లు.. ఆరోపణలతో ముందుముందు వారిద్దరినీ ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు.