Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వరం మారుతున్నది. ఆమె చేస్తున్న ట్వీట్లు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సడెన్గా హిందూత్వవాదాన్ని వినిపిస్తున్నారామె. బీజేపీ నేతల కంటే ఎక్కువగా డోసు పెంచేస్తుండడంతో తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన కోట్లాది మంది కల అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇందులో కొత్తదనం కానీ, అభ్యంతరాలు కానీ లేకపోయినా.. తమిళనాడులోని డీఎంకే నేతలను ప్రశ్నిస్తున్నారామె.
Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్వరం మారుతోంది. ఆమె చేస్తున్న ట్వీట్లు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సడెన్గా హిందుత్వవాదాన్ని వినిపిస్తున్నారామె. బీజేపీ నేతల కంటే ఎక్కువగా డోసు పెంచేస్తుండడంతో తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన కోట్లాది మంది కల అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఇందులో కొత్తదనం కానీ, అభ్యంతరాలు కానీ లేకపోయినా.. తమిళనాడులోని డీఎంకే నేతలను ప్రశ్నిస్తున్నారామె.
హిందుత్వపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరని కవిత నిలదీస్తున్నారు. తాను ఒక పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తూ.. మరో పార్టీ అంశాలపై కవితకు ఎందుకనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కవిత వినిపిస్తున్న హిందుత్వవాదానికి, లిక్కర్ కేసులు లింక్ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఈడీ హడావుడి చేసింది. ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది.
రాష్ట్రంలో అధికారం దూరమైన నేపథ్యంలో భవిష్యత్లో చిక్కులు రాకుండా ఉండాలంటే బీజేపీకి దగ్గరవ్వాలనే వెర్షన్ను బీఆర్ఎస్లో కొందరు వినిపిస్తున్నారు. అందులో భాగంగానే కవిత ట్వీట్లు చేస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది.