తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తుది పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ – కాంగ్రెస్ ల మధ్య పోటీ పడుతున్నాయి. ప్రచారానికి మరికొద్ది గంటల్లో ఎండ్ కార్డ్ పడనుండటంతో.. అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు.
హుజురాబాద్లో బీఆర్ఎస్ అభ్యర్ధి కౌశిక్ రెడ్డి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తనకే ఓట్లు వేసి గెలిపించాలని అలా చేస్తే విజయ యాత్రకు వస్తానని.. లేకుంటే డిసెంబర్ 4వ తేదీన శవయాత్రకు రావాల్సి ఉంటుందని ఓటర్లను బెదిరిస్తూ స్పీచ్ లు ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలాపూర్ గ్రామంలో కౌశిక్ రెడ్డి ఈ రకమైన బెదిరింపులకు దిగారు.
తనకు ఓటు వేయకపోతే నాలుగో తేదీన శవయాత్ర ఉంటుందని కౌశిక్ రెడ్డి బెదిరిపులకు దిగారు. ఎన్నికల్లో తనను ఓడిస్తే ముగ్గురి శవాలను చూడాల్సి ఉంటుందని కౌశిక్ రెడ్డి ఓటర్లను ఎమోషనల్గా బెదిరిస్తున్నారు.
కౌశిక్ రెడ్డి సెంటిమెంట్ రగిలించి ఎన్నికల్లో గెలవలాని చూస్తున్నారని ఓటర్లు మండిపడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి ఖాయమని తేలడంతో కౌశిక్ రెడ్డి ఇలాంటి ఎత్తుగడ వేశారంటూ కాంగ్రెస్ అభ్యర్ధి మండిపడుతున్నారు. ఓటర్లను బెదిరిస్తున్న కౌశిక్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరుతున్నారు.