Karimnagar Loan App Death : పోలీస్ డిపార్ట్ మెంట్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. లోన్ యాప్ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా కరీంనగర్ లో లోన్ యాప్ వేధింపులకు ఓ యువకుడు బలయ్యాడు. కరీంనగర్ లోని సాయినగర్ కు చెందిన శ్రీరాముల శ్రవణ్.. లోన్ యాప్ ద్వారా 3 లక్షలు అప్పు తీసుకున్నాడు.
ఈ క్రమంలో లోన్ చెల్లించాలని యాప్ నిర్వాహకులు శ్రవణ్ ని వేధించసాగారు. దీంతో మనస్తాపం చెందిన శ్రవణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతన్ని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. శ్రవణ్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.