Karimnagar : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ప్రభుత్వ ఇంజినీరుకు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ శుక్రవారం తీర్పు ప్రకటించారు.
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ప్రభుత్వ ఇంజినీరుకు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ తీర్పు వెల్లడించారు.
గజానన ఆగ్రోమిల్స్ సంస్థకు పొల్యూషన్ లైసెన్స్ తీసుకునేందుకు సంస్థ ప్రతినిధి హరీష్కుమార్ 2010 జులై 17న నిజామాబాద్లోని ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి దరఖాస్తు చేసుకున్నాడు. పర్యావరణ ఇంజినీరు ముదావత్ చంద్రకాంత్ నాయక్ లైసెన్స్ మంజూరు చేయ్యడానికి రూ.75 వేల రూపాయలు లంచం చెల్లించాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వలేనని హరీష్ కుమార్ వెళ్లిపోయారు. మరోసారి లైసెన్స్ మంజూరు కోసం అదే ఇంజినీరును సంప్రదించగా రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
బాధితుడు అక్టోబరు 8న ఏసీబీ డీఎస్పీ సుదర్శన్రెడ్డిని సంప్రదించారు. ఆయన సలహా మేరకు హరీష్కుమార్ ఇంజనీర్ కు రూ.25 వేలు తీసుకెళ్లి కార్యాలయంలో ఇంజనీర్ కు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ, సీఐలు వెంకటేశ్వర్లు, సైదులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిశోర్కుమార్ వాదనలు వినిపించారు. కేసుని విచారించిన న్యాయస్థానం నిందితుడికి జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు. హైదరాబాద్ లోని తార్నాకకు చెందిన ఇంజనీర్ చంద్రకాంత్ నాయక్ ప్రస్తుతం సనత్ నగర్ లో విధులు నిర్వహిస్తున్నాడు.