Kaleshwaram Project : క్వాలిటీ కంట్రోల్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు సీఈ అజయ్ కుమార్ పై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అఫిడఫిట్ ఎలా సమర్పిస్తారు…
క్వాలిటీ కంట్రోల్ సీఈ స్థాయిలో ఉంటూ రికార్డులను సరిచూసుకోకుండానే అఫిడవిట్ ఎలా సమర్పిస్తారని నిలదీసింది. ఈ క్రమంలోనే అజయ్ కుమార్ తీరుపై కమిషన్ చీఫ్ చంద్ర ఘోష్ ధ్వజమెత్తారు.
ఎన్నిసార్లు పర్యటించారు…
అసలు క్వాలిటీ కంట్రోల్ విధులు ఏమిటి, దాని పరిధి ఎంతవరకు ఉంది, ఇప్పటివరకు ఏమేం పనులు చేశారని కమిషన్ ఆరా తీసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎన్నిసార్లు సందర్శించారని కమిషన్ అడిగింది.
ఎందుకు విజిట్ చేయలేదు…
ప్రమాదం జరగకముందు మాత్రమే ఆయా బ్యారేజీలను పరిశీలించానని కమిషన్ కు అజయ్ కుమార్ సమాధానం చెప్పారు. సుందిళ్ల బ్యారేజీని ఎందుకు పరిశీలించలేదని కమిషన్ మరో ప్రశ్న సంధించింది.
వరదలు వచ్చినా సరే పోలేదా…
తొలిసారిగా వరదలు వచ్చిన తర్వాత ఈ మూడు బ్యారేజీల క్వాలిటీ కంట్రోల్ సీఈగా ఉన్న మీరు వాటిని పరిశీలించారా లేదా అని ఆరా తీసింది. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉన్న కారణంగా ప్రాజెక్టులను సందర్శించలేదని అజయ్ కుమార్ జవాబిచ్చారు.
also read : మరోసారి కాళేశ్వరం బహిరంగ విచారణ.. కాళేశ్వరం ఓపెన్ కోర్టు