Delhi Liquor Scam latest news(Breaking news in telangana): ఢిల్లీ లిక్కర్ కోసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితి కేసును విచారిస్తున్న ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జస్టిస్ కావేరి భావేజా నియమిస్తూ హైకోర్టు మెజిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కు సంబంధించి అన్ని ఈడీ, సీబీఐ కేసుల్లో జస్టిస్ ఎంకే నాగ్పాల్ న్యాయవాదిగా వ్యవహరించారు. జస్టిస్ నాగ్పాల్ తో పాటుగా ఢిల్లీ హైకోర్టు జ్యూడీషియల్ సర్వీసులోని మరో 26 మంది జడ్జీలు బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఎంకే నాగపాల్ ను ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు నుంచి తీస్ హజారీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
అనూహ్యంగా కవిత కేసును విచారిస్తున్న జడ్జి నాగ్పాల్ బదిలీ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసన తర్వాత ఆమె సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావు కలిశారు. కవితతో భేటీ అయిన తర్వాత వారు ఈడీ కార్యాలయం నుంచి వెనుతిరిగారు.