JP Nadda | బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని అన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అంటే అవినీతి, రాక్షసుల పార్టీ అని అన్నారు.
హైదరాబాద్లోని నారాయణపేటలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఫలితాలు ప్రజలకు అందలేదన్నారు. ధరణి పోర్టల్ ద్వారా కేసీఆర్ పేదల భూములను దోచుకున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఒక ఏటిఎంలా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంతో మంది త్యాగంతో సాధించుకున్న తెలంగాణలో ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని విమర్శలు చేశారు. ఈనెల 30న జరిగే ఎన్నికలతో కేసీఆర్కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అవినీతిపై విచారణ చేసి.. ఆయనకు జైలుకు పంపిస్తామని చెప్పారు. మియాపూర్ భూముల వేలంలో కేసీఆర్ రూ.4 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారిన ఆరోపింంచారు. దళితబంధు పథకంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 3 శాతం కమీషన్ తీసుకుంటున్నారని.. అలాంటి ప్రభుత్వాన్ని అందరూ కలిసి సాగనంపాలని నడ్డా కోరారు.
.
.