Jogulamba Gadwal news(Today news in telangana):
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమ్మిచేడు సమీపంలో కారు డివైడర్ ను ఢీకొట్టడంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గద్వాలలోని ఓ వైద్యుని కుమార్తె పుట్టిన రోజు వేడుకలకు హాజరై పెబ్బేరుకు వెళ్తుండగా జమ్మిచేడు సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనలో మృతులు నరేష్(23), పవన్ కుమార్(28), ఆంజనేయులు(50) అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు గోవర్ధన్(20), నవీన్(20), మహబూబ్(23)కి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.