Jeevan Reddy : కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణలో నెంబర్ వన్ 420 KCR అని చెప్పారు. కేసీఆర్ దళితులను మోసం చేశారన్నారు. డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామన్న కేసీఆర్ ఒక్క రూమ్ కూడా ఏ ఒక్కరికి ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. TRS నుంచి తెలంగాణ పదం తొలగించిన కేసీఆర్కు తెలంగాణ పదాన్ని ఉచ్చరించే హక్కు లేదన్నారు.
సీలేరు ప్రాజెక్టు, భద్రాచలంలోని ఏడు మండలాలను ఏపీకి ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి కేసీఆర్ అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రం తెచ్చిన ప్రతి చట్టానికి కేసీఆర్ మద్దతు ఇచ్చారని తెలిపారు. KCR కమీషన్ల వల్లే తెలంగాణ లక్ష కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. కవితను కాపాడిన విధంగానే కేసీఆర్ను కాపాడాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని వెల్లడించారు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
.
.