JanaSena : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించారు. కూకట్పల్లి స్థానం కోసం స్థానిక బీజేపీ లీడర్లు ప్రయత్నించినప్పటికీ ఆ సీటును జనసేనకు కేటాయించారు. ఇక ఈ స్థానం నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బరిలోకి దిగనున్నారు.
తాండూర్ నుంచి నేమూరి శంకర్ గౌడ్.. కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి.. నాగర్ కర్నూల్ నుంచి వంగ లక్ష్మణ్ గౌడ్ పోటీ చేయనున్నారు. ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ.. కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రావు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఎస్టీ స్థానాలైన వైరా నుంచి డా. తేజావత్ సంపత్ నాయక్.. అశ్వారావుపేట నుంచి మూయబోయిన ఉమాదేవి ఎన్నికల సమరంలో తాడోపేడో తేల్చుకోనున్నారు.