జగిత్యాల జిల్లా పొలాస వద్ద విజయపురి వీధికి చెందిన దయాల రమేశ్, గణేశ్ అనే ఇద్దరి వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రమేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. గణేశ్ తీవ్రంగా గాయపడి రోడ్డు పై పడిపోయాడు. అటుగా ద్విచక్రవాహనంపై వెళుతున్న ధర్మపురి మండలం నేరెళ్ల కు చెందిన అక్కినపల్లి బాబుకుమార్, సత్తయ్యలు అనే ఇద్దరు వ్యక్తులు ఆగి ప్రమాదానికి గురైన వారికి సహాయం చేయడానికి వెళ్లారు.
ఈ క్రమంలో మరో గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొట్టింది. బాబు కుమార్ కాలు పూర్తిగా తెగిపోయి కొద్ది దూరంలో పడిపోయింది. సత్తయ్యకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన రహదారిపై రెండు కిలోమీటర్ల మేరా ట్రాఫిక్ స్తంభవించింది. జగిత్యాల రూరల్ ఎస్సై సధాకర్ ట్రాఫిక్ క్లియర్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.