Jagadeeshwar Goud : శేరిలింగంపల్లిలో విజయం తనదే అంటున్నారు కాంగ్రెస్ అభ్యర్ది జగదీశ్వర్ గౌడ్. కాంగ్రెస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారని బిగ్ టీవీ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని తెలిపారు.ఈసారి ఎన్నికల్లో గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని జగదీశ్వర్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు పాజిటివ్ వేవ్స్ కనిపిస్తున్నాయన్నారు. యువత కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. కొత్త ఓటర్లు కాంగ్రెస్ కే ఓటేస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. 6 గ్యారెంటీలే హస్తం పార్టీని గెలిపిస్తాయని స్పష్టం చేశారు. సంక్షేమంతోపాటు సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తాగు నీటి సమస్యను తీరుస్తానని జగదీశ్వర్ గౌడ్ హామీ ఇచ్చారు.
తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు చెక్ పెట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చెప్పిందంటే చేస్తుందనేది తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగిరి తీరుతుందన్నారు. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని జగదీశ్వర్ గౌడ్ స్పష్టం చేశారు.
.
.