IT Raids : ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధులపై ఐటీ వేట మొదలైంది. హైదరాబాద్లో ఐటీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్ధి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి శంషాబాద్లోని నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారజాము 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 50 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు.
మాధాపూర్ లోని ఆఫీసుతోపాటు కోకాపేటలోని NCC అర్బన్ అపార్ట్మెంట్లోని ఇంటిపై దాడులు కొనసాగుతున్నాయి.
ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు. కేఎల్ఆర్ వియ్యంకుడు రాజేందర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు.
మహేశ్వరంలో కేఎల్ఆర్ గెలుపు ఖాయమన్న భయంతోనే ఆయన్ని టార్గెట్ చేశారని అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఎన్ని కుయుక్తులు పన్నినా మహేశ్వరం లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటున్నారు కేఎల్ ఆర్ అభిమానులు. ఇలా ఎన్నికల ముందుకు ఐటీ దాడులు చేయడంపై మండిపడుతున్నారు. ఈ చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.