IT Raids: హైదరాబాద్ లో మంగళవారం ఉదయం నుంచీ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఒక న్యూస్ ఛానల్ ఎండీ ఇల్లు సహా 10 ప్రాంతాల్లో ఐటీ దాడులు జరగడం కలకలం రేపింది. న్యూస్ ఛానల్ ఎండీ, ఫైనాన్స్ కంపెనీ ఓనర్ బొల్లా రామకృష్ణ నివాసంలో తనిఖీలు చేపట్టారు. కూకట్ పల్లిలో ఉన్న రెయిన్ బో విస్టా లో ఆయన అద్దెకు ఉంటున్నారు. ఆ ఇంటితో పాటు బషీర్ బాగ్ లో ఉన్న పైగా ప్లాజాలో గల ఫైనాన్స్ కంపెనీలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
బొల్లా రామకృష్ణ రన్ చేస్తున్న ఆస్పత్రిలోనూ తనిఖీలు చేపట్టారు అధికారులు. ఆయన ఇల్లు, ఆఫీసును ఐటీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. ఇప్పటి వరకూ జరిపిన సోదాల్లో అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు.
కూకట్ పల్లి రెయిన్ బో విస్టాస్ అపార్టమెంట్ లో ఐటీ సోదాలు..
ఉదయం ఐదున్నర గంటల నుంచి వ్యాపారవేత్త బొల్లా రామకృష్ణ చౌదరి నివాసంలో తనిఖీలు
సోదాల్లో పాల్గొన్న దాదాపు 8 మంది అధికారులు@IncomeTax_APTG @B_RK_YOUVASENA#Hyderabad #ITRaids #BigTV pic.twitter.com/wqVYtwUNuK
— BIG TV Breaking News (@bigtvtelugu) September 24, 2024