IPS Transfers : తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతుంది. తాజాగా 23 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక సర్వీసుల అదనపు డీజీపీగా వి.వి.శ్రీనివాసరావును నియమించింది.
పోలీసు నియామక బోర్డు ఛైర్మన్గా వి.వి. శ్రీనివాసరావుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.కో-ఆర్డినేషన్ డీఐజీగా గజరావు భూపాల్, మహిళా భద్రత విభాగం డీఐజీగా రెమా రాజేశ్వరి, రాజేంద్రనగర్ డీసీపీగా సీహెచ్ శ్రీనివాస్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-3గా ఆర్.వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.