Sathwik case: హైదరాబాద్ నార్సింగిలోని ఓ కార్పొరేట్ ఇంటర్ కాలేజీలో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రొఫెసర్లు ఆచార్య, కృష్ణారెడ్డి, వార్డెన్ నరేశ్లపై పోలీసులు 305 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ఇక ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడయ్యాయి. కళాశాలలో వేధింపుల కారణంగానే సాత్విక్ చనిపోయినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాత్విక్ను తోటి విద్యార్థుల ముందే పదే పదే కొడుతూ అసభ్యకరంగా తిట్టడం వల్లే మానసికంగా కుంగిపోయాడిని తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న రోజు సాత్విక్ తల్లిదండ్రులు వచ్చి వెళ్లగానే ప్రొఫెసర్ కృష్ణారెడ్డి అతడిని చితకబాదాడని.. ఇంట్లో వాళ్లను దూషిస్తూ కృష్ణారెడ్డి బూతులు తిట్టాడని పేర్కొన్నారు. అలాగే వార్డెన్ నరేశ్ హాస్టల్లో పదే పదే వేధించడంతో మనస్తానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని రిమాండ్ రిపోర్గులో పేర్కొన్నారు.