EPAPER

TS High Court : వరద సాయంపై విచారణ.. 500 కోట్లపై హైకోర్టు ప్రశ్నలు..

TS High Court : వరద సాయంపై విచారణ.. 500 కోట్లపై హైకోర్టు ప్రశ్నలు..
TS High Court


TS High Court : తెలంగాణలో వర్షాలు, వరదలపై ధాఖలైన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై రెండోసారి నివేదికను హైకోర్టుకు అందజేసింది తెలంగాణ ప్రభుత్వం. వరదలపై ప్రభుత్వం దాఖలు చేసిన నివేదికపై విచారణ చేపట్టింది హైకోర్టు. వరదల ప్రభావంతో 49 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం నివేదికలో తెలిపింది. 500 కోట్లు పునరావాసం కోసం కేటాయించినట్లు వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం.

రెండోసారి ప్రభుత్వం దాఖలు చేసిన నివేదిక కూడా అసంపూర్తిగా ఉందని వాదనలు వినిపించారు పిటిషనర్ తరుపు న్యాయవాది. వరద ప్రభావం, నష్టంపై మరో నివేదిక మోమోను హైకోర్టుకు సమర్పించారు పిటిషనర్‌ తరపు న్యాయవాది. 500 కోట్లు ఎవరికి ఎంత పరిహారం ఇచ్చారో నివేదికలో లేదని ప్రశ్నించింది హైకోర్టు. 500 కోట్లు ఎలా ఖర్చు చేశారో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.


అంటువ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో తెలపాలని.. చనిపోయిన 49 మందికి ఎంత నష్ట పరిహారం చెల్లించారో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఆగష్టు 17 వాయిదా వేసింది హైకోర్టు.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×