New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తొలుత ప్రధాన ప్రవేశ గేటు వద్ద పూజలు నిర్వహించారు. తర్వాత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమశాల వద్ద యాగ పూర్ణాహుతిలో కేసీఆర్ పాల్గొన్నారు. అక్కడి నుంచి ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభించారు.
సచివాలయంలో శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. తూర్పుగేటు నుంచి సచివాలయంలోనికి వెళ్లారు. బ్యాటరీ కారులో తిరుగుతూ సచివాలయాన్ని పరిశీలించారు. అనంతరం అనంతరం కొత్త సచివాలయం ఆరో అంతస్తులోని తన ఛాంబరుకు చేరుకున్నారు. తన ఛాంబర్ లో కేసీఆర్ పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ఫైల్ పై సీఎం కేసీఆర్ తొలి సంతకం చేశారు. మొత్తం 6 ఫైళ్లపై సీఎం సంతకాలు చేశారు. యాద్రాది కాఫీ టేబుల్ బుక్ ను ఆవిష్కరించారు. పలువురు మంత్రులు, పార్టీ నేతలు కేసీఆర్ కు పుష్పగుచ్ఛాలు అందించి కాళ్లకు దండం పెట్టారు.
మరోవైపు మంత్రులు కూడా ముహూర్త సమయంలో తమ ఛాంబర్లలోకి ప్రవేశించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్ నిర్ణయించిన సమయానికి తమ సీట్లలో ఆసీనులయ్యారు. వివిధ దస్త్రాలపై సంతకాలు చేశారు.