Ayodhya Ram Mandir Rangoli : హిందు సనాతన ధర్మంలో సంక్రాంతి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంక్రాంతి అంటేనే ఆడవాళ్లకు ముగ్గుల పండుగ. రంగు రంగుల ముగ్గులు వేయడం ఆనవాయితీగా వస్తోంది. పండగ రోజు ఎవరి ఇంటి ముందు చూసినా రంగ వల్లులు దర్శనమిస్తాయి.
అయితే దేశవ్యాప్తంగా ఎవరి నోట విన్నా ఈనెల 22న అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ట గురించే వినిపిస్తోంది. ఎవరికి వారు ఆ రాముడిని తలుచుకుంటూ తమ తమ పద్దతిలో భక్తిని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేసముధ్రం మండలానికి చెందిన చౌదరి శ్రీదేవి, ఆనంద్ దంపతులు వినూత్నంగా ఆలోచించారు.
అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఇంటి ముందు రాముడు ముగ్గు వేశారు. శ్రీరాముడి తలంబ్రాల వితరణ జరగడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఆ ఆలోచనతోనే ఇంటి ముందర ఆయోధ్య శ్రీరాముడి ఆలయ ప్రారంభాన్ని స్వాగతిస్తూ ఈ ముగ్గు వేసినట్లు తెలిపారు.
మరో వైపు కేసముద్రం స్టేషన్కు చెందిన దుర్గా, ప్రసన్న, రోజా శ్రీరాముడు కొలువుదీరనున్న అయోధ్య ఆలయాన్నే ముగ్గుగా వేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఈ ముగ్గులను చూసిన ప్రతీ ఒక్కరూ భక్తి పారవశ్యంతో మునిపోతున్నారు.