EPAPER

Orange Alert : సుర్రుమంటున్న సూరీడు.. 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌

Orange Alert : సుర్రుమంటున్న సూరీడు.. 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌

SummerSummer: మార్చి నెల మొదటి నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని తెలుగు రాష్ట్రాలపై చూపిస్తున్నాడు. తాజాగా భానుడు మరింత ఉగ్రరూపం దాల్చాడు. దీంతో ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావడానికి బయపడిపోతున్నారు. అయితే భానుడి ప్రతాపం మరికొన్ని రోజులు కొనసాగనుందని ఐఎండీ తెలిపింది. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోనున్నాయని.. కొన్ని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.


రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు అధికంగా ఉందని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాల అధికారులకు వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటుగా నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సైతం వడగాల్పులు వీచే అవకాశం ఉందంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సోమవారం నుంచి రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గతంలో కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని వెల్లడించింది. పగటి సమయంలో వృద్ధులు, చిన్నారులు బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరించింది.


Tags

Related News

Telangana Floods: ఖమ్మంలో భారీ వర్షం.. వెంటనే వెళ్లిపోయిన మంత్రులు భట్టి, పొంగులేటి

Deepthi Jeevanji: దీప్తికి రివార్డ్.. గ్రూప్ 2 ఉద్యోగం, వరంగల్‌లో 500 గజాల స్థలం.. సీఎం ఆర్డర్

HYDRA: మురళీ మోహన్ జయభేరి సంస్థకు నోటీసులు.. హైడ్రా దూకుడు కంటిన్యూ

Huge Flood: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు భారీగా వస్తున్న వరద.. అధికారులు ఏం చేశారంటే?

Khairatabad Ganapathi: ఖైరతాబాద్ గణపతి వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్.. 10 రోజులపాటు ఆల్టర్నేట్ రూట్లు ఇవే

Jaggareddy: పీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ నియామకంపై స్పందించిన జగ్గారెడ్డి.. లేకపోతే నేనే అయ్యేటోడినీ..

TPCC: కొత్త బాస్ ముందున్న.. అతిపెద్ద సవాల్

Big Stories

×