EPAPER

GHMC : గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిషనర్‌గా ఇలంబర్తి, పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

GHMC : గ్రేటర్ హైదరాబాద్ కొత్త కమిషనర్‌గా ఇలంబర్తి, పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కొత్త కమిషనర్‌గా ఇలంబర్తి నియామకమయ్యారు. ఈ మేరకు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. పలువురు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా ఆర్.వి.కర్ణన్‌, ఆయుష్‌ డైరెక్టర్‌గా క్రిస్టినాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇక టూరిజం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌, విద్యుత్‌ శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియా, మహిళా సంక్షేమ శాఖ కార్యదర్శిగా టి.కె.శ్రీదేవిని నియమించారు.

తెలంగాణ నుంచి ఏపీకి చెందిన నలుగురు అధికారులు ఇప్పటికే రిలీవ్‌ అయ్యారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేసిన ఆమ్రపాలి సైతం ఏపీ ప్రభుత్వంలో రిపోర్ట్ చేశారు. దీంతో కీలకమైన నగర బల్దియా కమిషనర్ స్థానం ఖాళీ కాగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా భర్తీ చేసింది.


ఆయా ఐఏఎస్‌లు వదిలిన స్థానాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంఛార్జీలను నియమించింది. డీఓపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి వాణిప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి ఏపీకి రిలీవ్ అయ్యారు.

Also Read : గురుకులాలకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసింది – ఎమ్మెల్సీ కోదండరాం

Related News

CM Revanth Reddy: దిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ భేటీ, క్యాబినెట్ బెర్తులపైనా కీలక సమావేశం

Ekashila Housing Society: ఏకశిలలో ఏకఛత్రాధిపత్యం, సొసైటీ మాటున అక్రమాలెన్నో.. ‘స్వేచ్ఛ’ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ

Mlc Kodandaram : గురుకులాలకు బీఆర్ఎస్ తీరని అన్యాయం చేసింది – ఎమ్మెల్సీ కోదండరాం

Special Powers To Hydra: హైడ్రా కోరలకు మరింత పదును.. జీవో జారీ, ఇక వాటిపై కమిషనర్‌దే ఫైనల్ నిర్ణయం

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వంపై హారీష్ రావ్ ఫైర్

Telangana, Ap IAS Officers : ఐఏఎస్ ఐపీఎస్’లకు ఏపీ, తెలంగాణ సర్కారు ఝలక్, హైకోర్టు తీర్పు కంటే ముందే రిలీవ్ ఆర్డర్స్ ?

Big Stories

×