IAS Transfers : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో.. ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శిగా రాహుల్ బొజ్జను నియమిస్తూ ఉత్తర్వూలను జారీ చేశారు. గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పని చేసిన స్మిత సబర్వాల్ను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా నియమించారు.
IAS Transfers : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో.. ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శిగా రాహుల్ బొజ్జను నియమిస్తూ ఉత్తర్వూలను జారీ చేశారు. గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పని చేసిన స్మితా సభర్వాల్ను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా నియమించారు.
నల్గొండ కలెక్టర్ గా దాసర హరిచందన, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ గా డి. దివ్య, పురావస్తు శాఖ డైరెక్టర్ గా భారతి హోళికేరి, గనుల శాఖ ముఖ్యకార్యదర్శిగా మహేష్ దత్ ఎక్కా, ప్రణాళిక ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నజీర్, బీసీ సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, జీఏడీ కార్యదర్శిగా ఎం.రఘునందన్రావు, పంచాయతీరాజ్, ఆర్డీ కార్యదర్శిగా సందీప్ సుల్తానియా, ఆయుష్ డైరెక్టర్గా ఎం.ప్రశాంతి, ఫైనాన్స్, ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణభాస్కర్ లను నియమించారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా కె.శశాంక, జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్గా బి.ఎం.సంతోష్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా అద్వైత్ కుమార్ సింగ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి, పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య డైరెక్టర్గా చిట్టెం లక్ష్మి, కార్మికశాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, పీసీబీ సభ్య కార్యదర్శిగా బుద్ధప్రకాశ్, మైనార్టీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఎ.ఎం.ఖానమ్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీగా ఆర్.వి.కర్ణన్ సీఎంవో జాయింట్ సెక్రటరీగా సంగీత సత్యనారాయణలను నియమిస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు.