Hyderabad News : ట్రీట్మెంట్ కోసం వస్తే.. 50 లక్షల విలువైన డైమాండ్ రింగ్ కొట్టేశారు. పోలీసుల విచారణకు భయపడిపోయి.. బాత్రూమ్ కమోడ్లో విసిరేశారు. ఇది హైదరాబాద్లో ఎఫ్ఎమ్ఎస్ దంత, చర్మ ఆస్పత్రిలో జరిగిందీ నిర్వాకం. ఇంతకీ ఏం జరిగింది?
జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స వచ్చింది మహిళ . చికిత్స చేసేటప్పుడు చేతికున్న డైమండ్ రింగ్ను పక్కన పెట్టి.. మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన ఆ మహిళ హాస్పిటల్ కు వెళ్లి సిబ్బందిని నిలదీసింది. సిబ్బంది సమాధానం చెప్పకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
అయితే ఆస్పత్రిలో పనిచేసిన మహిళ.. నిజం ఒప్పుకుంది. టిష్యూ పేపర్లో ఉంగారాన్ని చుట్టి పర్స్ లో దాచిపెట్టానని.. ఆతర్వాత పోలీసుల విచారణ భయంతో బాత్రూం కామెడ్ లో పడేసానని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు బాత్రూం తవ్వి ఉంగారాన్ని వెలికి తీశారు . మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.