హైదరాబాద్లో దారుణ ఘటన వెలుగు చూసింది. ముక్కు శస్త్ర చికిత్స కోసం వచ్చిన వ్యక్తిని.. మృతదేహంగా బయటికి పంపింది ఓ ప్రైవేట్ హాస్పిటల్. ఈ ఘటన ఎల్బీనగర్ చింతలకుంట అమ్రిత హాస్పిటల్ లో చోటు చేసుకుంది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆ వ్యక్తి చనిపోయాడని.. మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టడం హాట్ టాపిక్ గా మారింది.
చౌటుప్పల్ మండలం తంగేడుపల్లికి చెందిన సిలివేలు శేఖర్.. ముక్కుకు సంబంధించిన సమస్యతో అమ్రిత హాస్పిటల్ లో చేరాడు. అయితే ముక్కుకు శస్త్ర చికిత్స ఫెయిల్ కావడంతో.. సీరియస్ గా ఉందని చెప్పి వేరే హాస్పిటల్ తీసుకెళ్లాలని యాజమాన్యం సూచించింది. ఈ మేరకు మలక్ పేట లోని యశోద హాస్పిటల్ కు తీసుకెళ్ళగా.. చనిపోయిన బాడీనీ తీసుకొచ్చారని యశోద వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా ఖంగుతిన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే శేఖర్ చనిపోయాడని.. కుటుంబ సభ్యులు, బంధువులు హాస్పటల్ ముందు నిరసన చేస్తున్నారు. యాజమాన్యం పట్టించుకొకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Hyderabad Crime