LB Nagar Murder Case News(Hyderabad latest news): తీసుకున్నడబ్బు తిరిగి ఇవ్వలేదని ఎల్బీనగర్లో వెంకట్ అనే వ్యక్తిని హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. వెంకట్ను ఆరుగురు చిత్రహింసలు పెట్టి హత్య చేశారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పు వసూలు చేసేందుకు 9గంటల పాటు దాడి చేశారు. ఈ దాడి చేసిన వారిలో మృతుడు వెంకట్ స్నేహితుడు కూడా ఉన్నాడు.
Read More: కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్..అసెంబ్లీలో పెట్టిన ప్రభుత్వం..
దాడిని అడ్డుకున్న మృతుడు భార్యని కూడా నిందితులు తీవ్రంగా కొట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకట్ చిన్న మొత్తాల్లో చాలా మంది నుంచి అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లై ఏడాది కూడా కాలేదని వెంకట్ భార్య కన్నీరు మున్నీరవుతుంది. వెంకట్ మృతదేహం ఉస్మానియా మార్చురీలో ఉంది.