Hyderabad: హైదరాబాద్ లాంకోహిల్స్ లో జరిగిన బిందుశ్రీ ఆత్మహత్యపై విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆత్మహత్యకు కారణమంటూ పూర్ణచంద్రావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పూర్ణచంద్రావు.. ల్యాంకోహిల్స్ అపార్ట్మెంట్స్ 15 ఎల్హెచ్ బ్లాక్లో భార్య, కుమార్తెతో ఉంటున్నాడు. పదేళ్లుగా కాకినాడకు చెందిన బిందుశ్రీ.. ఆయన కూతురుకు కేర్ టేకర్గా పనిచేస్తోంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది.
పూర్ణచంద్రావు గతవారం మరో మహిళను తన కూతురుకు కేర్టేకర్ గా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరగగా.. బిందుశ్రీ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బిందుశ్రీ తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు.. పూర్ణచంద్రావును అరెస్టు చేసిన రిమాండ్ కు తరలించారు.
పోలీసుల విచారణలో పూర్ణచంద్రావు అరాచకాలు బయటపడుతున్నాయి. గతంలో కన్నడ సినిమాల్లో నటించిన ఆయన.. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ.. చాలా మంది అమ్మాయిలకు ఎరవేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చాలామంది మహిళలు, యువతులు తన ఫ్లాట్ కు వచ్చి వెళ్లేవారని సమాచారం. బిందుశ్రీ ఆత్మహత్యకు మూడ్రోజుల ముందు కూడా నలుగురు యువతులు ఫ్లాట్కు వచ్చారని తెలుస్తోంది.