Hyderabad-Delhi Flight Emergency Landing After Take off in 20 Minutes : హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్తున్న విస్తారా విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ఈ మేరకు శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన 20 నిమిషాల తర్వాత ఫ్లైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది.
180 మంది ప్రయాణికులతో ఫ్లైట్…
శంషాబాద్ నుంచి దిల్లీకి గాల్లోకి ఎగిరిన విస్తారా ఫ్లైట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తగానే పైలెట్ అప్రమత్తం అయ్యారు. దాదాపుగా 20 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత తిరిగి హైదరాబాద్ ఏయిర్ పోర్టులోనే అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. విస్తారా ఫ్లైట్ లో దాదాపు 180 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
Also Read : కేసీఆర్, కవిత ఏమయ్యారు? బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరం, రీఎంట్రీలు వాయిదా!