Hyderabad Crimes : దిల్సుఖ్నగర్ మహదేవ్ జ్యువెలరీ షాపులో జరిగిన కాల్పలకు సంబంధింది హైదరాబాద్ సీపీ మహేశ్ భగవత్ కీలక విషయాలు వెళ్లడించారు. నిందితుల కోసం 15 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామన్నారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో బంగారు షాపులో కాల్పులు జరిగాయన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి ఆధారాలు సేకరించారని తెలిపారు. ఘటనలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్లు అనుమానిస్తున్నామన్నారు. రెండు బైకులపై వచ్చి కాల్పులు జరిపినట్లు నిర్ధారించారు. 2018లో దోపిడీకి పాల్పడ్డ యూపీ గ్యాంగ్ కు చెందిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడ్డారా అని ఆరా తీస్తున్నామన్నారు. నిందితుల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.